

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సామాజిక సేవా కార్యక్రమాల్లో మరో ముందడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్వస్థ్ నారీ, వికసిత్ భారత్’ కార్యక్రమంలో భాగంగా హెచ్పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో 400కు పైగా కార్యక్రమాలకు అసోసియేషన్ మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమాల ద్వారా ఇప్పటివరకు లక్ష మందికి పైగా బాలికలు, యువతులకు అవగాహన కల్పించినట్లు తెలిపింది.

హెచ్పీవీ వ్యాక్సినేషన్ ప్రాధాన్యత, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై యువతుల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహించినట్లు అసోసియేషన్ పేర్కొంది. అల్లు అర్జున్ అభిమానులు సమష్టిగా చేసిన కృషితో ఈ మైలురాయిని సాధించినట్లు తెలిపింది. బాలికలు, యువతులకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ భవిష్యత్తులోనూ సామాజిక బాధ్యత కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!