

గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు, చిన్న పడవలతో దాడులు జరపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. యూఏఈ రక్షణ వ్యవస్థలు 12 బాలిస్టిక్ మిసైళ్లు, 3 క్రూయిజ్ మిసైళ్లు, 4 డ్రోన్లను అడ్డుకున్నాయి. ఒమన్లోని ముసందం ప్రాంతంలో ఒక నివాస భవనం దెబ్బతిని ఇద్దరు విదేశీయులు గాయపడ్డారు. ఈ దాడులను యూరోపియన్ యూనియన్, సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించాయి. భద్రతా కారణాలతో యూఏఈ విమానాలను తాత్కాలికంగా నిలిపివేసింది.
హర్ముజ్ జలసంధిలో కూడా ఇరాన్ అమెరికా రక్షణలో ఉన్న నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది. అయితే తమ నౌకలు సురక్షితంగా ఉన్నాయని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. దక్షిణ కొరియాకు చెందిన ఒక వాణిజ్య నౌక దాడుల్లో దెబ్బతింది. ఈ పరిస్థితుల్లో వందలాది నౌకలు హర్ముజ్లో నిలిచిపోయాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ మాత్రం దాడుల్లో తమ పాత్ర లేదని చెబుతూ సైనిక పరిష్కారం కాకుండా రాజకీయ పరిష్కారం అవసరమని పేర్కొంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!