
జనరల్

తెలంగాణలో పదో తరగతి (SSC) పరీక్షా ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను ప్రకటించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం వెల్లడించింది. ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు అధికారికంగా ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఫలితాల ప్రకటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.
గత నెల 14న ప్రారంభమైన ఈ పరీక్షలు ఈ నెల 13న ముగిశాయి. సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ నెల 23 నాటికి జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తయింది. మొదట మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, ప్రక్రియను వేగవంతం చేసి రేపు ఫలితాలను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!