

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో జరిగిన పేపర్ లీక్ ఘటనల నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని వ్యాఖ్యానించింది. 2024లో జరిగిన వివాదం తర్వాత సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన మానిటరింగ్ కమిటీ సూచనలను అమలు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని ఎన్టీఏను ఆదేశించింది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం, సీబీఐకి కూడా నోటీసులు జారీ చేసింది.
వైద్య విద్య ప్రవేశ పరీక్షల నిర్వహణను ఎన్టీఏ నుంచి తొలగించి స్వతంత్ర సంస్థకు అప్పగించాలని కోరుతూ ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా ఎన్టీఏ వైఫల్యాలపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో చేసిన సిఫార్సుల అమలుపై గురువారం లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్టీఏకు ధర్మాసనం ఆదేశించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!