
సినిమాలు

అయోధ్య రామాలయంలో విరాళాల సొమ్ము దుర్వినియోగం కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు అవినాశ్ శుక్లా విచారణలో, విరాళాల లెక్కింపు ప్రక్రియలో ఉన్న లోపాలను ఉపయోగించుకుని సిబ్బంది సొమ్మును అక్రమంగా తీసుకున్నట్లు వెల్లడించినట్లు సమాచారం.
దొంగిలించిన డబ్బును వెంటనే బయటకు తీసుకెళ్లకుండా ముందుగా మరుగుదొడ్లలో దాచిపెట్టి, అనంతరం అక్కడి నుంచి తరలించినట్లు విచారణలో తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన విచారణలో లెక్కింపు విధానంలోని లోపాలు, సొమ్ము మళ్లించిన తీరు, అనంతరం జరిగిన పరిణామాలను నిందితుడు వివరించినట్లు సమాచారం. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!