
జనరల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ సాయంత్రం జరిగినట్లు జనసేన వర్గాలు వెల్లడించాయి.
అమరావతిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కార్యక్రమానికి హాజరుకావడానికి ముందు రామ్ చరణ్ జనసేన కార్యాలయానికి వెళ్లి పవన్ కళ్యాణ్ను కలిశారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు, వివరాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!