

‘పళ్ళ బురుసు’ సినిమా తనను ఒకేసారి నవ్వించి, కంటతడి పెట్టించిందని కింగ్ నాగార్జున ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహించగా, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తల్లిదండ్రుల పట్ల బాధ్యత, ప్రేమను ఈ సినిమా ఎంతో హృద్యంగా చూపించిందని నాగార్జున పేర్కొన్నారు. నటీనటుల ప్రదర్శన, సంగీతం, టీమ్ వర్క్ను ప్రశంసిస్తూ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.
ఈ చిత్రం కుటుంబ కథా నేపథ్యంలో హాస్యంతో పాటు భావోద్వేగాలను మేళవిస్తూ రూపొందించబడింది. ప్రతి కుటుంబంలో జరిగే చిన్న చిన్న సంఘటనలను హృదయానికి హత్తుకునేలా చూపించామని చిత్రబృందం తెలిపింది. పవన్ సీహెచ్ అందించిన సంగీతం, బలమైన సాంకేతిక బృందం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కొత్త కథలను ప్రోత్సహిస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్కు చిత్రబృందం కృతజ్ఞతలు తెలిపింది. ఈ సినిమా ప్రేక్షకులకు ఒక ప్రత్యేక అనుభూతిని అందిస్తుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!