

సీబీఐ డైరెక్టర్గా కొనసాగుతున్న ప్రవీణ్సూద్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. ప్రస్తుతం ఆయన పదవీకాలం ఈ నెల 24తో ముగియాల్సి ఉండగా, తాజా నిర్ణయంతో 2027 మే వరకు కొనసాగనున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం, ఎంపిక కమిటీ సిఫార్సుల మేరకు క్యాబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) ఈ పొడిగింపును ఆమోదించింది.
1986 బ్యాచ్కు చెందిన కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన ప్రవీణ్ సూద్ భారత దర్యాప్తు సంస్థకు మరో ఏడాది పాటు అధిపతిగా కొనసాగనున్నారు. ఈ ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కూడా సభ్యుడిగా ఉన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి సమావేశంలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ రెండు పేజీల అసమ్మతి నోట్ సమర్పించిన మరుసటి రోజే ఈ నిర్ణయం వెలువడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!