

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న వేళ నరేంద్ర మోదీ పౌరులకు కీలక విజ్ఞప్తి చేశారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలని, వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ సమావేశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనవసర ప్రయాణాలను తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. దీంతో దేశవ్యాప్తంగా చర్చ మొదలవగా, మళ్లీ లాక్డౌన్ తరహా పరిస్థితులు వస్తాయా అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం పశ్చిమాసియా ఘర్షణల తర్వాత 40కి పైగా దేశాలు ఇంధన పొదుపు చర్యలు చేపట్టాయి. పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇండోనేసియా, దక్షిణ కొరియా వంటి దేశాలు వర్క్ ఫ్రమ్ హోమ్, ఏసీ ఉష్ణోగ్రతల పరిమితులు, విదేశీ ప్రయాణాల ఆంక్షలు, ఫ్యూయల్ రేషనింగ్, వాహన వినియోగ నియంత్రణ వంటి చర్యలను అమలు చేస్తున్నాయి. కొన్ని దేశాలు ప్రజలకు సూచనలు చేస్తుండగా, మరికొన్ని దేశాలు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!