
జనరల్

స్వాతంత్ర్య సమరయోధుడు ఖుదీరామ్ బోస్ జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులర్పించారు. కేవలం 18 ఏళ్ల వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం ఖుదీరామ్ బోస్ ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా భయంలేకుండా పోరాడిన వీరుడిగా ఆయనను కొనియాడారు. ఖుదీరామ్ బోస్ ధైర్యం, దేశభక్తి నేటికీ యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.
స్వతంత్ర భారతాన్ని చూడలేకపోయినా ఖుదీరామ్ బోస్ త్యాగం స్వాతంత్ర్యానికి బలమైన పునాదిగా నిలిచిందని పవన్ కళ్యాణ్ అన్నారు. మాతృభూమిపై ప్రేమకు వయసుతో సంబంధం లేదని ఆయన జీవితం చాటిచెబుతోందన్నారు. యువతలో ధైర్యం, దేశభక్తి, దేశంపై అంకితభావాన్ని ఖుదీరామ్ బోస్ స్ఫూర్తి ఎల్లప్పుడూ పెంపొందిస్తుందని తెలిపారు. “భారత్ మాతకు ధైర్యవంతుడైన కుమారుడు ఖుదీరామ్ బోస్, జై హింద్” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!