

నాలుగు రోజుల భారత్ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రధాని నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలోని సేవా తీర్థ్లో భేటీ అయ్యారు. సుమారు గంటకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో రక్షణ, వాణిజ్యం, కీలక సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరిగాయి. స్వేచ్ఛాయుత, సురక్షిత ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని ప్రోత్సహించే అంశంపైనా ఇరు దేశాలు ఫలవంతమైన చర్చలు జరిపినట్లు భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు.
ఇంతకుముందు అమెరికా నుంచి నేరుగా కోల్కతా చేరుకున్న రూబియో మదర్ థెరీసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీని తన భార్య జీనెట్తో కలిసి సందర్శించారు. అక్కడ థెరీసాకు నివాళులర్పించిన ఆయన ఆమె సేవా భావాన్ని ప్రశంసించారు. భారత్ పర్యటనలో భాగంగా ఈ నెల 26న న్యూఢిల్లీలో జరగనున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో కూడా రూబియో పాల్గొననున్నారు. ఈ కూటమిలో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా సభ్యులుగా ఉన్న సంగతి తెలిసిందే.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!