

తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి లేఖ రాస్తూ సత్తుపల్లి బ్లాక్-3 బొగ్గు గనిని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కు కేటాయించాలని కోరారు. ఇటీవల తాడిచర్ల-2 బొగ్గు గనిని సింగరేణికి కేటాయించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన మంత్రి, అదే విధంగా సత్తుపల్లి బ్లాక్-3 విషయంలో కూడా సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తన లేఖలో సత్తుపల్లి బ్లాక్-3 ప్రస్తుతం సింగరేణి నిర్వహిస్తున్న గనులకు ఆనుకుని ఉండటంతో, ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలు, సాంకేతిక నైపుణ్యం, రైల్వే సైడింగ్, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ వంటి వనరులను వినియోగించి తక్కువ సమయంలో బొగ్గు తవ్వకాలను ప్రారంభించవచ్చని వివరించారు. ఈ నిర్ణయం దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంతో పాటు తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, సింగరేణి భవిష్యత్ విస్తరణకు దోహదపడుతుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!