

సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించింది. రాష్ట్ర ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, మత్స్యశాఖ అధికారులు కలిసి మొత్తం రూ.60 లక్షల చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు. ఇందులో మత్స్యశాఖ నుంచి రూ.5 లక్షలు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.5 లక్షలు చొప్పున మంజూరు చేశారు.
మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన వెంటనే కోస్ట్ గార్డ్, నేవీతో కలిసి గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. 72 గంటలు గడిచినా మత్స్యకారుల ఆచూకీ లభించకపోవడంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పరిహారం అందించినట్లు చెప్పారు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, ప్రమాదం నుంచి బయటపడిన మత్స్యకారుడు మరియు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!