

అడవుల విస్తరణ, సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా స్థాపించబడిన రాష్ట్రంలోని తొలి అటవీ కళాశాల పరిశోధన కేంద్రంలో బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సుకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 2016లో హైదరాబాద్ దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో ప్రారంభమైన ఈ సంస్థను అనంతరం సిద్దిపేట జిల్లా ములుగుకు తరలించి ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేశారు. 52 హెక్టార్లలో రూ.72 కోట్లతో నిర్మించిన భవనాలు 2018 నుంచి వినియోగంలో ఉన్నాయి.
నాలుగేళ్ల బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సులో 45 సీట్లకు దరఖాస్తులు ఆహ్వానించగా, ఈ నెల 25 వరకు గడువు ఉంది. ఇంటర్ (బైపీసీ, ఎంబైపీసీ, ఎంపీసీ) ఉత్తీర్ణులై టీజీ ఎప్సెట్ 2026లో అర్హత సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అటవీ సంరక్షణ, జీవ వైవిధ్యం, వన్యప్రాణి సంరక్షణ, పర్యావరణ నిర్వహణ వంటి అంశాలతో పాటు ప్రాక్టికల్ శిక్షణ, ఫీల్డ్ పర్యటనలు, నర్సరీలు, తేనెటీగల పెంపకం శిక్షణ అందిస్తున్నారు. ఇప్పటివరకు 587 మంది పట్టభద్రులై, వారిలో 348 మంది ఉద్యోగాలు పొందారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!