
బిజినెస్

కోనసీమ ప్రాంతంలోని లంక గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. ఠాణేలంక నుంచి గురజాపులంక వరకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద ఉధృతి కారణంగా పడవలు, పంటు ప్రయాణాలను అధికారులు నిలిపివేశారు. దీంతో లంక గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
వరద ప్రభావంతో పశుగ్రాసం కొరత ఏర్పడి మూగజీవాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తమకు అవసరమైన పశుగ్రాసాన్ని వెంటనే అందించాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు. పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తూ సహాయక చర్యలకు సిద్ధమవుతున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!