

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని టీటీడీ ఖండించింది. పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరి పీచు ఉన్నట్లు కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై స్పందించిన టీటీడీ.. ఇలాంటి ప్రచారం బాధ్యతారాహిత్యమని పేర్కొంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలో ఉన్నది వాస్తవానికి శ్రీవారి లడ్డూ ప్రసాదం కాదని స్పష్టం చేసింది. ఇలాంటి అవాస్తవాలను భక్తులు నమ్మవద్దని, సమాచారాన్ని నిర్ధారించుకున్న తర్వాతే నమ్మాలని, ఇతరులతో పంచుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ విషయంలో టీటీడీ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని తెలిపింది. ఎంతో భక్తి శ్రద్ధలతో, నిర్దేశిత సంప్రదాయాలు, విధానాలను పాటిస్తూ శ్రీ వైష్ణవ బ్రాహ్మణుల పర్యవేక్షణలో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తున్నట్లు పేర్కొంది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అవాస్తవాలు, అసత్య ప్రచారాలు చేయడం సమంజసం కాదని టీటీడీ స్పష్టం చేసింది. తప్పుడు సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!