

తెలంగాణ రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో రైల్వే భవన్లో సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనులు, కొత్త ప్రాజెక్టులు, ఎలక్ట్రిఫికేషన్, భవిష్యత్ ప్రణాళికలపై ఈ సమావేశంలో సమీక్ష జరిగింది.
తెలంగాణలోని 42 ప్రధాన రైల్వే స్టేషన్ల అభివృద్ధితో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు కీలకమైన ఎం.ఎం.టి.ఎస్ సేవలపై కూడా చర్చ జరిగింది. టైమింగ్స్ రెగ్యులరైజేషన్, ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదలపై కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేయగా, రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొత్త రైల్వే లైన్లు, హైస్పీడ్ కారిడార్ ప్రాజెక్టులపై కూడా చర్చ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో తెలంగాణ రైల్వే అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని రైల్వే మంత్రి స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!