

యోగాగురువు బాబా రామ్దేవ్ గతంలో చేసిన వ్యాఖ్యలకు బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తాజాగా ఘాటుగా స్పందించారు. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన విద్యార్థులను కంగనా గతంలో ‘జనరేషన్ గట్టర్’గా అభివర్ణించడంతో వివాదం చెలరేగింది. దీనిపై రామ్దేవ్ స్పందిస్తూ.. యువతను అలా విమర్శించేందుకు కంగనకు అర్హత ఏముందని ప్రశ్నించారు. ఆమె వ్యక్తిగత జీవితం గురించి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ విమర్శలకు కంగనా తాజాగా కౌంటర్ ఇచ్చారు. తన జీవితం, వ్యక్తిత్వం గురించి రామ్దేవ్కు ఎలా తెలుసని ప్రశ్నిస్తూ, “ఆయన నా బెడ్రూమ్లో గబ్బిలంలా వేలాడుతున్నారా?” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. యోగాగురువు నుంచి వ్యాపారవేత్తగా ఎదిగిన రామ్దేవ్ తనకు వ్యక్తిత్వం గురించి బోధించాల్సిన అవసరం లేదని అన్నారు. సనాతన ధర్మం నుంచి వ్యాపార రంగంలోకి వెళ్లిన ఆయన.. ఆయుర్వేద ఉత్పత్తుల నుంచి ఇతర వినియోగ వస్తువుల వరకు వ్యాపారాన్ని విస్తరించారని విమర్శించారు. గతంలో పతంజలి సంస్థ ప్రకటనలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయంటూ కంగనా కోర్టును ఆశ్రయించిన విషయం కూడా తెలిసిందే.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!