

పట్టణ పేదలకు గౌరవప్రదమైన జీవితం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. అర్బన్ ప్రాంతాల్లో తొలి దశగా లక్ష ఇళ్ల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించగా, 24 నియోజకవర్గాల్లో ఎల్ఐజీ ఇళ్ల కోసం ప్రభుత్వ స్థలాల పరిశీలన ప్రారంభమైంది.
ఈ నేపథ్యంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మహమ్మద్ అజారుద్దీన్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కలిసి నాంపల్లి, మలక్పేట్, బహదూర్పురా ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను పరిశీలించారు. స్థానికంగా అందుబాటులో ఉన్న భూములపై నిర్మాణ అవకాశాలను అధికారులు సమీక్షించారు.
మంత్రి మాట్లాడుతూ, పేదలు నివసించే ప్రాంతాలకు దూరంగా కాకుండా అదే ప్రాంతాల్లోనే ఇళ్లను నిర్మించాలనే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే లక్షల ఇళ్ల నిర్మాణం కొనసాగుతుండగా, పట్టణాల్లో కూడా అదే స్థాయిలో లక్ష ఇళ్ల నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!