

దేశవ్యాప్తంగా ప్రజలకు సులభమైన ఇంటర్నెట్ సేవలను అందించేందుకు టెలికమ్యూనికేషన్స్ శాఖ (డాట్) పీఎం-వాణి (ప్రధానమంత్రి వై-ఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్) పథకం కింద పలు కొత్త సంస్కరణలను ప్రవేశపెట్టింది. ల్యాప్టాప్లు మరియు ఇతర డివైస్ల కోసం క్యూ ఆర్ కోడ్ ఆధారిత లాగిన్ సదుపాయం, 15, 30, 60 నిమిషాల స్వల్పకాలిక వైఫై ప్లాన్లు, అలాగే హాట్స్పాట్ పేర్లను ఒకే విధంగా ప్రమాణీకరించడం వంటి మార్పులు ఇందులో ఉన్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్న అందరికీ అందుబాటు డిజిటల్ కనెక్టివిటీ దిశగా ఈ చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్త మార్గదర్శకాలను ఎనిమిది వారాల్లో అమలు చేయాలని సంబంధిత సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించింది. విద్యార్థులు, ప్రయాణికులు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులకు ఈ పబ్లిక్ వైఫై సేవలు మరింత ఉపయోగపడనున్నాయని ప్రభుత్వం పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!