

భారత్లో భానుడి ఉగ్రరూపానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం ఉదయం విడుదలైన AQI.in గణాంకాల ప్రకారం ప్రపంచంలోని అత్యంత వేడి ఉన్న టాప్-50 నగరాలు అన్నీ భారత్లోనే నమోదయ్యాయి. మధ్యాహ్నానికి ముందే పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ను దాటగా, ఒడిశాలోని బాలన్గిర్లో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహారాష్ట్రలోని చంద్రాపుర్, ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉత్తర్ప్రదేశ్, తెలంగాణ, బిహార్, ఛత్తీస్గఢ్, హరియాణా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో తీవ్ర వడగాలుల పరిస్థితులు కొనసాగుతున్నాయి. భారత వాతావరణ విభాగం ఇప్పటికే వాయువ్య, మధ్య భారత రాష్ట్రాలకు రెడ్ మరియు ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసింది. మరోవైపు డీహైడ్రేషన్, వడదెబ్బ కేసులు ఆసుపత్రుల్లో పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, బయట పనిచేసేవారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మధ్యాహ్నం వేళ అనవసరంగా బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!