
రాజకీయాలు

చెరువుల్లోకి శుద్ధి చేసిన నీటిని చేరేలా ఆధునిక సాంకేతికతలను అధ్యయనం చేసేందుకు హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ బిట్స్ పిలానీ గోవా క్యాంపస్ను సందర్శించారు. తక్కువ ఖర్చుతో మురుగునీటిని శుద్ధి చేసే ‘వర్టికల్ ఫ్లో కన్స్ట్రక్టెడ్ వెట్ల్యాండ్’ టెక్నాలజీని ఆయన పరిశీలించారు.
ఈ సాంకేతికతను తొలుత బమృకున్-ఉద్-దౌలా చెరువులో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించారు. చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతో ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!