
జనరల్

తెలంగాణలో నేడు ఉక్కపోతతో కూడిన వాతావరణం కొనసాగనుంది. పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అధిక ఉష్ణోగ్రతలు, తేమ ప్రభావంతో ప్రజలు అసౌకర్యానికి గురయ్యే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
సాయంత్రం సమయంలో హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ నెల 17వ తేదీ వరకు తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలాగే జూన్ 18 నుంచి 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాల తీవ్రత పెరిగి, పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!