
జనరల్

వేసవి సెలవుల నేపథ్యంలో వారాంతంలో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శనివారం 90,011 మంది, ఆదివారం 91,020 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. రద్దీని అంచనా వేసిన అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.
క్యూలైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు, వైద్య సేవలు అందించారు. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద తిరుమలకు వెళ్లే వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఉదయం నుంచి రాత్రి వరకు 10,814 వాహనాలు తిరుమలకు చేరుకున్నాయి.
తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ల వద్ద సర్వదర్శన టోకెన్ల కోటా తెల్లవారుజామున గంటలోపే పూర్తవడం భక్తుల రద్దీ తీవ్రతను సూచిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!