
జనరల్

తెలంగాణలో వడదెబ్బతో మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 51 మంది వడదెబ్బతో మృతి చెందారు. గత మూడు రోజుల్లో మొత్తం 107 మంది ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.
అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 23 మంది మరణించారు. 32 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 46 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. భద్రాద్రి, జగిత్యాల, సూర్యాపేట, ఖమ్మం, మంచిర్యాల, ములుగు, కొమురం భీం జిల్లాల్లో 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 27వ తేదీ వరకు వడగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!