

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కు ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం లభించింది. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాలకు చెందిన ప్రముఖులకు కూడా పౌర పురస్కారాలు ప్రదానం చేశారు.
2026 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ పురస్కారాలకు ఆమోదం తెలిపింది. ఇందులో పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. స్వదేశంలో జరిగిన మహిళల వన్డే ప్రపంచ కప్లో భారత జట్టును విజేతగా నిలిపిన హర్మన్ప్రీత్ చరిత్ర సృష్టించింది. ఆమె నాయకత్వంలో భారత్ తొలిసారి ప్రపంచ కప్ గెలిచింది.
ఇక పారా ఒలింపిక్ స్వర్ణ పతక విజేత ప్రవీణ్ కుమార్, మహిళల హాకీ అభివృద్ధికి సేవలు అందించిన కోచ్ బల్దేవ్ సింగ్లకు కూడా పద్మశ్రీ పురస్కారం లభించింది. వారి సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈ గౌరవాన్ని అందించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!