
క్రీడలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించే చట్టాలపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా దేశంలో సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో ఇలాంటి నిబంధనలు ఇప్పటికీ అవసరమా అని ధర్మాసనం ప్రశ్నించింది.
ఈ అంశానికి సంబంధించిన 2003 నాటి తీర్పును పునఃసమీక్షించనున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. మారుతున్న జనాభా పరిస్థితులు, సామాజిక వాస్తవాలు, రాజ్యాంగపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ చట్టాల చెల్లుబాటుపై సమగ్రంగా పరిశీలించనున్నట్లు పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!