
బిజినెస్

ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలకు సంబంధించిన కంటెంట్ను తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. జస్టిస్ పి.ఎస్. నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. ప్రతి చిన్న అంశానికీ నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించకుండా, అందుబాటులో ఉన్న న్యాయపరమైన మార్గాలను ముందుగా వినియోగించాలని సూచించింది.
దేశ న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థపై విశ్వాసం ఉంచాలని ధర్మాసనం పేర్కొంది. ఆర్టికల్ 32 కింద దాఖలైన ఈ పిటిషన్ వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నట్లు ప్రాథమికంగా కనిపిస్తున్నాయని జస్టిస్ పి.ఎస్. నరసింహ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు న్యాయ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!