

వరుడి ఎంపిక విషయంలో అవాస్తవ అంచనాలు పెట్టుకున్నారనే కారణంతో ఓ యువతి ప్రొఫైల్ను తన మ్యారేజ్ సేవల నుంచి తొలగించినట్లు ప్రముఖ మ్యారేజ్ కన్సల్టెంట్ ఓయేంద్రిలా కపూర్ వెల్లడించారు. ఆమె వివరాల ప్రకారం, 28 ఏళ్ల యువతి ఏడాదికి సుమారు రూ.11 లక్షలు సంపాదిస్తోంది. మొదట చదువుకున్న, మంచి కుటుంబ నేపథ్యం ఉన్న, స్థిరమైన ఉద్యోగం చేసే వరుడు కావాలని చెప్పిన కుటుంబ సభ్యులు, తరువాత మాత్రం ఏడాదికి రూ.1 కోటి కంటే ఎక్కువ సంపాదించే బెంగాలీ బ్రాహ్మణ వరుడే కావాలని స్పష్టం చేశారు.
ఈ ప్రమాణాలకు సరిపోయే వరులను సంప్రదించినప్పటికీ, వారిలో ఎవరూ ఈ సంబంధంపై ఆసక్తి చూపలేదని కపూర్ తెలిపారు. దీంతో ఆ యువతి ప్రొఫైల్ను సేవల నుంచి తొలగించినట్లు చెప్పారు. వ్యక్తిగత అభిరుచులు ఉండటం తప్పు కాదని, అయితే అవి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. "అత్యాశను పురుషులు దూరం నుంచే గుర్తిస్తారు" అనే ఆమె వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ, వివాహంలో వ్యక్తిగత ప్రమాణాలు ఎంతవరకు సమంజసమనే అంశంపై చర్చ కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!