
జనరల్

భారీ వర్షాల కారణంగా అస్సాంలో సంభవించిన వరదలు తీవ్ర మానవీయ సంక్షోభాన్ని సృష్టించాయి. ప్రాణ నష్టంతో పాటు లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆహారం, తాగునీరు, మందులు, వసతి వంటి ప్రాథమిక అవసరాల కోసం బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అస్సాం వరద బాధితులకు సహాయం అందించేందుకు నందమూరి బసవతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ సహాయ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
వరద బాధిత కుటుంబాల కోసం బట్టలు, దుప్పట్లు, పాదరక్షలు, పొడి ఆహారం, బియ్యం, తాగునీరు, శానిటరీ కిట్లు వంటి అవసరమైన వస్తువులను ట్రస్ట్ సేకరిస్తోంది. హైదరాబాద్లోని జేఎన్టీయూ, కేపీహెచ్బీలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఈ సహాయ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని ట్రస్ట్ తెలిపింది. ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం అందించాలని కోరింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!