2, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మనీ గేమింగ్ సంస్థల పై ఈడీ కఠిన చర్యలు...రూ.523 కోట్ల డిపాజిట్ల ఫ్రీజ్‌

Writer: Venkatesh 07:25 AM, 25 నవంబర్, 2025
మనీ గేమింగ్ సంస్థల పై ఈడీ కఠిన చర్యలు...రూ.523 కోట్ల డిపాజిట్ల ఫ్రీజ్‌

దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ మనీ గేమింగ్ సంస్థల పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కఠిన చర్యలు చేపట్టింది. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (PMLA) కింద ఢిల్లీ, బెంగళూరు, గురుగ్రామ్ ప్రాంతాల్లో ఉన్న వింజో మరియు గేమ్స్‌క్రాఫ్ట్ కార్యాలయాలు, అలాగే ప్రమోటర్ల నివాసాల పై దాడులు నిర్వహించింది. ఈ దాడుల నేపథ్యంలో మొత్తం రూ.523 కోట్ల విలువైన బ్యాంకు డిపాజిట్లను ఈడీ స్తంభింపజేసింది.

‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ యాక్ట్–2025’ ప్రకారం దేశంలో రియల్ మనీ గేమ్స్ నిషేధితమైన నేపథ్యంలో కూడా, ఈ రెండు సంస్థలు ప్లేయర్ల డబ్బును తిరిగి చెల్లించకుండా తమ వద్దే ఉంచుకున్నాయని ఈడీ ఆరోపించింది.

వింజో ప్లాట్‌ఫాంలో యూజర్లు నిజమైన వ్యక్తులతో కాకుండా అల్గారిథమ్‌లు మరియు సాఫ్ట్‌వేర్‌తో గేమ్ ఆడుతున్నారనే విషయాన్ని దాచిపెట్టారని, ఈ చర్యలు నేరపూరితమైనవని అధికారులు పేర్కొన్నారు. బ్రెజిల్, అమెరికా, జర్మనీ వంటి దేశాల్లో కూడా రియల్ మనీ గేమింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వింజో వద్ద ఇంకా రూ.43 కోట్ల మేర గేమర్ల డబ్బు నిల్వగా ఉండటాన్ని, రూ.505 కోట్ల అక్రమ డిపాజిట్లను ఫ్రీజ్ చేసినట్లు తెలిపారు.

ఇదే సమయంలో, ‘పాకెట్52.కామ్’ పేరుతో గేమింగ్ సేవలు అందించిన గేమ్స్‌క్రాఫ్ట్ సంస్థ కూడా రూ.30 కోట్లకుపైగా కస్టమర్ల డబ్బును తమ వద్దే ఉంచుకున్నట్లు గుర్తించారు. ఈ సంస్థకు చెందిన రూ.18.57 కోట్లను స్తంభింపజేశారు.

వింజో యూజర్లు తమ వాలెట్‌లోని డబ్బును విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని అడ్డుకోవడం లేదా పరిమితం చేయడం ద్వారా, అల్గారిథమ్‌ల సహాయంతో కస్టమర్ల డబ్బును కొల్లగొట్టినట్లు కూడా ఈడీ తెలిపింది. విదేశీ పెట్టుబడుల పేరిట నిధులను అమెరికా, సింగపూర్‌లకు తరలించినట్లు గుర్తించారు. అమెరికాలోని బ్యాంకులో 55 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.490 కోట్లు) ఉంచినట్లు ఆరోపించారు.

ఈ పరిణామంపై వింజో స్పందించింది. దర్యాప్తు సంస్థకు పూర్తిగా సహకరిస్తున్నామని ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కీలక నిర్ణయం

పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కీలక నిర్ణయం

చెరువుల పునరుజ్జీవంతో హైదరాబాద్‌కు కొత్త రూపు

చెరువుల పునరుజ్జీవంతో హైదరాబాద్‌కు కొత్త రూపు

పెండింగ్ కేసులపై సీబీఐ కీలక నిర్ణయం

పెండింగ్ కేసులపై సీబీఐ కీలక నిర్ణయం

ఈ20 వ్యతిరేక ఆందోళనపై ఉత్కంఠ

ఈ20 వ్యతిరేక ఆందోళనపై ఉత్కంఠ

దాడులకు భయపడను: పప్పు యాదవ్

దాడులకు భయపడను: పప్పు యాదవ్

కాక్రోచ్ జనతా పార్టీ తదుపరి కార్యాచరణపై దృష్టి

కాక్రోచ్ జనతా పార్టీ తదుపరి కార్యాచరణపై దృష్టి

ట్యాగ్లు
ఈడీఆన్‌లైన్‌ గేమింగ్వింజోగేమ్స్‌ క్రాఫ్ట్మనీ లాండరింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కెరీర్ ప్రారంభ కష్టాలను గుర్తుచేసుకున్న విజయ్ వర్మ
సినిమాలు

కెరీర్ ప్రారంభ కష్టాలను గుర్తుచేసుకున్న విజయ్ వర్మ

బాలీవుడ్ మార్పులపై సంజయ్ దత్ వ్యాఖ్యలు
సినిమాలు

బాలీవుడ్ మార్పులపై సంజయ్ దత్ వ్యాఖ్యలు

‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు
సినిమాలు

‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు

పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కీలక నిర్ణయం
జనరల్

పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కీలక నిర్ణయం

చెరువుల పునరుజ్జీవంతో హైదరాబాద్‌కు కొత్త రూపు
జనరల్

చెరువుల పునరుజ్జీవంతో హైదరాబాద్‌కు కొత్త రూపు

దులీప్ ట్రోఫీకి దక్షిణ మండల జట్టు ఎంపిక
క్రీడలు

దులీప్ ట్రోఫీకి దక్షిణ మండల జట్టు ఎంపిక

శ్రీజా అకులా నాలుగు పతకాలతో మెరిసింది
క్రీడలు

శ్రీజా అకులా నాలుగు పతకాలతో మెరిసింది

విజయ్ సేతుపతి గెస్ట్ రోల్స్‌కు గుడ్‌బై
సినిమాలు

విజయ్ సేతుపతి గెస్ట్ రోల్స్‌కు గుడ్‌బై

మెగా-కింగ్ కాంబోపై అభిమానుల్లో ఆసక్తి
సినిమాలు

మెగా-కింగ్ కాంబోపై అభిమానుల్లో ఆసక్తి

రిలయన్స్ క్యాపిటల్ బాండ్లపై వివాదం
బిజినెస్

రిలయన్స్ క్యాపిటల్ బాండ్లపై వివాదం

పంజాబ్ టోర్నీలో పరుగుల తుఫాన్ సృష్టించిన అభిషేక్
క్రీడలు

పంజాబ్ టోర్నీలో పరుగుల తుఫాన్ సృష్టించిన అభిషేక్

నెటిజన్స్ ను కలచివేస్తున్న మెహర్ రమేష్ ఎమోషనల్ పోస్ట్
సినిమాలు

నెటిజన్స్ ను కలచివేస్తున్న మెహర్ రమేష్ ఎమోషనల్ పోస్ట్

ఫుడ్ డెలివరీలోకి ఫ్లిప్‌కార్ట్ ఎంట్రీ
బిజినెస్

ఫుడ్ డెలివరీలోకి ఫ్లిప్‌కార్ట్ ఎంట్రీ

పెండింగ్ కేసులపై సీబీఐ కీలక నిర్ణయం
జనరల్

పెండింగ్ కేసులపై సీబీఐ కీలక నిర్ణయం

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం
బిజినెస్

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!