

యూపీఐ ద్వారా జరిగే అధిక విలువైన వ్యాపార లావాదేవీలపై కొత్తగా మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధించడాన్ని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ అశోక్ కుమార్ లహిరి సమర్థించారు. డిజిటల్ చెల్లింపు సేవలు ఎప్పటికీ ప్రభుత్వ సబ్సిడీలపై ఆధారపడలేవని ఆయన అన్నారు. రూ.100 లావాదేవీపై 40 పైసలు చెల్లించడం పెద్ద భారం కాదని పేర్కొన్నారు. అయితే, ఇవి తన వ్యక్తిగత అభిప్రాయాలని, నీతి ఆయోగ్ అధికారిక వైఖరి కాదని లహిరి స్పష్టం చేశారు.
వ్యాపారాలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించే మార్గాలను అన్వేషించాలని లహిరి సూచించారు. ఈ సందర్భంగా చాణక్యుడి బోధనలను ప్రస్తావిస్తూ.. పువ్వుకు నష్టం కలగకుండా తేనెను సేకరించే తేనెటీగలా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని పేర్కొన్నారు. అక్టోబర్ 15 నుంచి రూ.2,000కు మించిన అర్హత కలిగిన వ్యక్తి నుంచి వ్యాపారికి చేసే యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్ అమల్లోకి రానుంది. రూ.75,000, అంతకంటే ఎక్కువ లావాదేవీలకు ఈ ఛార్జీ గరిష్ఠంగా రూ.300గా ఉంటుంది. వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే యూపీఐ బదిలీలు మాత్రం ఉచితంగానే కొనసాగనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!