
జనరల్

ఏపీ ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ రాష్ట్రంలో ఎస్ఎస్సీ పరీక్షల వాల్యుయేషన్, ఫలితాల ప్రాసెసింగ్పై సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని విద్యార్థులు, ప్రజలను ఆయన కోరారు. అన్ని ప్రక్రియలు పారదర్శకత, గోప్యత, నిష్పాక్షికతతో జరుగుతున్నాయని తెలిపారు.
ఏపీ జిల్లాల విద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియా గ్రూప్ అడ్మిన్లకు సూచనలు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. అసత్య సమాచారం వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!