
జనరల్

మంత్రి కొండా సురేఖ, సీనియర్ నేత చిన్నారెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ తన నివేదికను సిద్ధం చేసింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ నివేదికను ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్కు పంపించారు. ఆమె నివేదికను పార్టీ అధిష్ఠానానికి సమర్పించనున్నట్లు సమాచారం. దీంతో కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం పరిధిలోకి వెళ్లింది.
ఇద్దరు నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాన్ని అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తుది నిర్ణయం తీసుకునే ముందు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయాలను కూడా అధిష్ఠానం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 20 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారం పార్టీలో మరింత చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!