
రాజకీయాలు

పిల్లల్లో మధుమేహానికి సంబంధించిన పరీక్షలు, నిర్ధారణ, చికిత్స మరియు దీర్ఘకాల నిర్వహణపై కేంద్ర ఆరోగ్య శాఖ సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శక పత్రం జాతీయ స్థాయి ఆరోగ్య సదస్సులో విడుదలైంది.
పుట్టిన పిల్లల నుంచి 18 ఏళ్ల లోపు వయస్సు గల వారిలో మధుమేహాన్ని ముందుగానే గుర్తించడం ఈ ప్రణాళిక లక్ష్యం. ఇందుకోసం గ్రామీణ మరియు పాఠశాల స్థాయిలో దేశవ్యాప్తంగా సార్వత్రిక పరీక్షలు నిర్వహించనున్నారు.
అనుమానిత కేసులకు వెంటనే రక్తంలో చక్కెర పరీక్షలు నిర్వహించి, నిర్ధారణ మరియు చికిత్స కోసం జిల్లా స్థాయి ఆరోగ్య కేంద్రాలకు పంపిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు, నిర్ధారణ, జీవితకాల ఇన్సులిన్ చికిత్స, కొలిచే పరికరాలు మరియు క్రమం తప్పని వైద్య సేవలను ఉచితంగా అందిస్తారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!