
జనరల్

రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని సుమారు 1.11 కోట్ల కార్మికులకు శుభవార్త ప్రకటించింది. కనీస వేతనాలను అన్ని విభాగాల్లో పెంచుతూ జూన్ 1 నుంచి అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కార్మికుల సంక్షేమం, ఆర్థిక భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సహా ఇతర మంత్రులతో కలిసి సీఎం మాట్లాడారు. అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్గా నాలుగు విభాగాలుగా వేతనాలను సవరించినట్లు తెలిపారు. అర్బన్, రూరల్ జోన్లను పరిగణలోకి తీసుకుని మూడు జోన్లుగా విభజించామని చెప్పారు. కార్మిక సంఘాలు, స్టేక్హోల్డర్లతో చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!