

అయోధ్య రామమందిరం విరాళాల నిధుల వినియోగంపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇద్దరు ఆలయ ఉద్యోగులను అధికారులు విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆలయ విరాళాల నుంచి సుమారు ₹7 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ విచారణ కొనసాగుతోంది. వార్షికంగా కేవలం ₹18 వేల నుంచి ₹20 వేల వరకు వేతనం పొందుతున్న ఉద్యోగులు వరుసగా ₹1.5 కోట్లు, ₹40 లక్షల విలువైన భూములను కొనుగోలు చేసినట్లు గుర్తించిన తర్వాత అనుమానాలు మరింత పెరిగాయి.
దర్యాప్తులో భాగంగా ఒక ఉద్యోగి నివాసంలో సుమారు ₹10 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కొనుగోళ్లపై అధికారులు ఆర్థిక లావాదేవీలు, భూ కొనుగోలు వివరాలు, విరాళాల నిధుల వినియోగాన్ని పరిశీలిస్తున్నారు. ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుండగా, అధికారికంగా మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!