
జనరల్

ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో సంక్షేమం, వ్యవసాయం, క్రీడలు, మౌలిక వసతుల అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీఎం సూర్య సరోవర్ యోజనకు రూ.5,070 కోట్లు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి రూ.3,15,614 కోట్లు కేటాయించారు. అలాగే ఈ పథకాన్ని 2030-31 వరకు కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది.
ఇక ఖేలో ఇండియా, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ పథకాల కోసం రూ.36,441 కోట్లు, సముద్ర మంథన్ కార్యక్రమానికి రూ.84,084 కోట్లు, క్వీన్ ట్యూబ్ టన్నెల్స్ నిర్మాణానికి రూ.9,779 కోట్లు మంజూరు చేశారు. మొత్తం రూ.4,50,988 కోట్ల నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!