

గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ బెర్న్స్టెయిన్, టాటా గ్రూప్కు చెందిన ట్రెంట్ లిమిటెడ్ షేరు పై కీలక అంచనా విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా ఈ స్టాక్ భారీ ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికీ, కంపెనీ పనితీరులో త్వరలో మెరుగుదల కనిపించే అవకాశం ఉందని సంస్థ భావిస్తోంది. అందుకే ట్రెంట్ షేరుకు ‘బై’ రేటింగ్తో పాటు రూ. 5000 టార్గెట్ ప్రైజ్ను సూచించింది. ప్రస్తుత ధర స్థాయిల నుంచి పెట్టుబడిదారులు సుమారు 18 శాతం లాభం పొందే అవకాశం ఉందని అంచనా వేసింది.
ట్రెంట్ షేరు గత ఏడాది కాలంలో దాదాపు 39 శాతం విలువను కోల్పోయింది. ఆదాయ వృద్ధి గత కొన్ని త్రైమాసికాలుగా మందగించడం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. అయితే కంపెనీ దిగజారే దశ ఇప్పుడు ముగింపు దశలో ఉందని, తిరిగి వృద్ధి పంథాలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని బెర్న్స్టెయిన్ పేర్కొంది. దీన్నిబట్టి దీర్ఘకాల పెట్టుబడిదారులకు ఈ స్టాక్ మళ్లీ ఆకర్షణీయంగా మారవచ్చని సంస్థ అభిప్రాయపడింది.
ఈరోజు ట్రేడింగ్ సమయంలో ట్రెంట్ షేర్ ధర సుమారు 1.37 శాతం తగ్గి రూ. 4168.70 వద్ద ట్రేడ్ అయింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్టం రూ. 7493.05 కాగా, కనిష్టం రూ. 4161 గా నమోదైంది. గత వారం, నెల, ఆరు నెలలు, ఏడాది కాలంలో ఈ షేరు వరుసగా 3 శాతం, 12 శాతం, 25 శాతం, 39 శాతం నష్టపోయింది. అయితే ఐదు సంవత్సరాల వ్యవధిలో మాత్రం ట్రెంట్ షేరు పెట్టుబడిదారులకు 516 శాతం రాబడి అందించింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1,48,000 కోట్లు.
ట్రెంట్ లిమిటెడ్ దేశంలోని ప్రముఖ రిటైల్ కంపెనీల్లో ఒకటి. టాటా గ్రూప్ ఫ్లాగ్షిప్ సంస్థ గా ఈ కంపెనీ వెస్ట్సైడ్, జూడియో, ఉత్సా వంటి రిటైల్ బ్రాండ్స్ను దేశవ్యాప్తంగా విస్తరించింది. ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ట్రెంట్, 1998 లో ప్రారంభమై, 2025 జూన్ నాటికి 27,887 మంది ఉద్యోగులను కలిగి ఉంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!