

మహేష్ బాబు, ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’పై గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కొత్త విషయాలు వెల్లడించారు. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ‘హే జోనాస్’ పోడ్కాస్ట్లో పాల్గొన్న ఆమె గత 14 నెలలుగా ఈ చిత్రం కోసం పనిచేస్తున్నానని తెలిపారు. రాజమౌళి ప్రతి సన్నివేశాన్ని ఎంతో శ్రద్ధగా రూపొందిస్తారని, అందుకే సినిమా నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతోందని పేర్కొన్నారు.
ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సాగే అద్భుతమైన టైమ్ ట్రావెల్ అడ్వెంచర్ అని ప్రియాంక వెల్లడించారు. ఇందులో సవాళ్లతో కూడిన యాక్షన్ స్టంట్లు, స్లో-మోషన్ సన్నివేశాల్లో నటించినట్లు కూడా హింట్ ఇచ్చారు. తన 24 ఏళ్ల సినీ ప్రయాణంలో ఇదే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం అని ఆమె చెప్పడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. మహేష్ బాబు హీరోగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, సుమారు ₹1,200 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!