
సినిమాలు

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భారతీయ సెన్సార్ వ్యవస్థపై తీవ్ర విమర్శలు గుప్పించారు. డిజిటల్ యుగంలో సినిమాలకు సెన్సార్ విధించడం అసంబద్ధమని, పెద్దవాళ్లు ఏ సినిమా చూడాలో తామే నిర్ణయించుకునే పరిణతి కలిగి ఉన్నారని పేర్కొన్నారు. ఓటు వేసే హక్కు ఉన్న వ్యక్తికి సినిమా ఎంపిక చేసే స్వేచ్ఛ కూడా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
సినిమాల్లో సన్నివేశాలను తొలగించడం వల్ల ప్రయోజనం లేదని, అవే సన్నివేశాలు కొద్ది గంటల్లోనే సోషల్ మీడియా, ఇతర డిజిటల్ వేదికల్లో వైరల్ అవుతున్నాయని వర్మ అన్నారు. సెన్సార్ కట్స్కు బదులుగా వయస్సు ఆధారిత కంటెంట్ వర్గీకరణ విధానం అమలు చేయాలని సూచించారు. భావప్రకటన స్వేచ్ఛను కాపాడేందుకు సినీ పరిశ్రమ మొత్తం ఏకమై సెన్సార్ విధానాన్ని సవాలు చేయాల్సిన సమయం వచ్చిందని ఆయన పిలుపునిచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!