

దేశీయ ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మార్కెట్ అంచనాలను మించి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జూన్తో ముగిసిన క్యూ1లో కంపెనీ రూ.4,624 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసి, గత ఏడాదితో పోలిస్తే 20 శాతం వృద్ధి సాధించింది. ఆదాయం కూడా 14 శాతం పెరిగి రూ.34,579 కోట్లకు చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి 1-4 శాతం ఆదాయ వృద్ధి అంచనాను కొనసాగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అలాగే వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.12 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. రికార్డు తేదీని ఈ నెల 17, చెల్లింపును 27న చేపట్టనున్నట్లు వెల్లడించింది.
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మెర్సిడెస్ బెంజ్ నుంచి 114 కోట్ల డాలర్ల ఏఐ డీల్తో సహా మొత్తం 240 కోట్ల డాలర్ల విలువైన కొత్త ఆర్డర్లను హెచ్సీఎల్ టెక్ దక్కించుకుంది. అలాగే దేశంలో 50 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు రూ.3,500 కోట్ల పెట్టుబడికి బోర్డు ఆమోదం తెలిపింది. మరోవైపు కంపెనీ ఉద్యోగుల సంఖ్య 3,292 మంది తగ్గి 2,23,889కు చేరగా, అట్రిషన్ రేటు 12.7 శాతానికి పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!