
క్రీడలు

భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, రాజేశ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్పై ఆర్థిక అవకతవకల ఆరోపణల నేపథ్యంలో చర్యలు చేపట్టింది. కంపెనీతో పాటు దాని ప్రమోటర్ రాజేశ్ మెహతాను సెక్యూరిటీస్ మార్కెట్ల నుంచి తాత్కాలికంగా నిషేధించింది. దీంతో కంపెనీ షేర్లు 5 శాతం పడిపడి లోయర్ సర్క్యూట్ను తాకి ₹103.92కు చేరాయి.
ఈ పరిణామాల ప్రభావం ఎల్ఐసీ షేర్లపై కూడా పడింది. రాజేశ్ ఎక్స్పోర్ట్స్లో 10.80 శాతం వాటా ఉన్న ఎల్ఐసీ షేరు విలువ 1 శాతం కంటే ఎక్కువగా పడిపోయి ఉదయం 11 గంటల సమయంలో ₹399.80 వద్ద ట్రేడైంది. విదేశీ అనుబంధ సంస్థల ఆదాయాల్లో తేడాలు, ముఖ్యంగా స్విట్జర్లాండ్ సంస్థ లావాదేవీల్లో గల లోపాలు సెబీ దర్యాప్తులో బయటపడటంతో ఈ చర్యలు తీసుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!