

భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలిచే ఈ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానికి థింసా, సవర, కొమ్ము కోయ వంటి గిరిజన సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలకాలని సూచించారు.
విమానాశ్రయ ప్యాసింజర్ టెర్మినల్తో పాటు జీఎంఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఏవియేషన్ హబ్-యూనివర్సిటీ, జీఎంఆర్-మాన్సాస్ ఎడ్యుసిటీని కూడా ప్రధాని ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్రను అంతర్జాతీయ లాజిస్టిక్స్, కనెక్టివిటీ కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి గేమ్చేంజర్గా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు. ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు ఉచిత విమాన ప్రయాణ అవకాశాన్ని కల్పించాలని, జూలై 31 వరకు విస్తృత ప్రచారం చేపట్టాలని, బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ట్రాఫిక్, భద్రత, పార్కింగ్, తాగునీరు, భోజనం తదితర అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!