

కుటుంబ సభ్యుడు లేదా పన్ను చెల్లింపుదారు మరణించిన తర్వాత వారి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసే బాధ్యత పూర్తిగా చట్టబద్ధమైన వారసుడిపైనే ఉంటుంది. ఇందుకోసం ఆదాయపు పన్ను శాఖకు ప్రత్యేకంగా మరణ సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే మరణించిన వ్యక్తి పాన్ కార్డును సరెండర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఆ పాన్ను అధికారిక అవసరాలు తప్ప మరెక్కడా ఉపయోగించకూడదు.
వారసులు మరణ ధ్రువీకరణ పత్రం, పాన్ కార్డు, గత సంవత్సరాల ఐటీఆర్లు, బ్యాంకు వివరాలు, ఫారం 26AS, AIS, TIS వంటి అన్ని ఆర్థిక పత్రాలను భద్రపరచాలి. ఒకటి కంటే ఎక్కువ మంది వారసులు ఉంటే వారంతా కలిసి ఒకరిని "రిప్రజెంటేటివ్ అసెసీ"గా ఎంపిక చేయాలి. అనంతరం లీగల్ హెయిర్ సర్టిఫికెట్తో పాటు అవసరమైన పత్రాలను సమర్పించి ఆదాయపు పన్ను పోర్టల్లో నమోదు చేసుకోవాలి.
ఆదాయపు పన్ను శాఖ అనుమతి ఇచ్చిన తర్వాత, మరణించిన తేదీ వరకు వచ్చిన ఆదాయానికే రిటర్న్ దాఖలు చేయాలి. ఇప్పటికే టీడీఎస్ కట్ అయి ఉంటే అవసరమైన పన్ను చెల్లించాలి లేదా రిఫండ్కు క్లెయిమ్ చేసుకోవచ్చు. మరణం తర్వాత వచ్చే ఆదాయం మాత్రం వారసుల ఆదాయంగా పరిగణించి, వారి వ్యక్తిగత ఆదాయపు పన్ను రిటర్న్లో చూపించాలి. అవసరమైతే పన్ను నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!