

అమెరికా, వెనెజువెలా నుంచి ముడిచమురు దిగుమతులను పెంచడాన్ని పరిశీలించాల్సిందిగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్పీసీఎల్) వంటి ప్రభుత్వరంగ రిఫైనరీ సంస్థలను కేంద్ర ప్రభుత్వం కోరినట్లు సమాచారం. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేయనుందని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో, స్పాట్ మార్కెట్ ద్వారా కొనుగోళ్ల సమయంలో అమెరికా గ్రేడ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించినట్లు రిఫైనరీ వర్గాలు తెలిపాయి. వెనెజువెలా చమురు విషయంలోనూ ఇలాంటి సూచనలు చేసినట్లు వెల్లడించాయి.
అయితే ఈ అంశంపై భారత ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. అమెరికా చమురు తక్కువ గంధకం కలిగి ఉండగా, భారత రిఫైనరీలు ప్రధానంగా మధ్యరకం చమురును శుద్ధి చేసేందుకు రూపుదిద్దుకున్నాయి. రవాణా వ్యయాలు కూడా కీలక అంశమని నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవల భారత రిఫైనరీలు సుమారు 4 మిలియన్ బ్యారెళ్ల వెనెజువెలా ముడిచమురును దిగుమతి చేసుకున్నట్లు సమాచారం. దేశ ఇంధన భద్రత దృష్ట్యా సరఫరా వనరులను విభిన్నీకరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!