
క్రీడలు

ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు భారీ స్థాయిలో బంగారం కొనుగోళ్లు చేపట్టడం వల్లే బంగారం ధరలు పెరుగుతున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్ తెలిపారు. ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, అంతర్జాతీయ మార్కెట్లలో పెరిగిన డిమాండ్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని పేర్కొన్నారు.
భారత్లో బంగారం, వెండి దిగుమతులు ఆందోళనకర స్థాయిలో లేవని ఆమె స్పష్టం చేశారు. విలువైన లోహాల మార్కెట్ పరిస్థితులను ఆర్బీఐ నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపారు. ఇటీవల అమెరికా సుంకాల్లో జరిగిన మార్పుల ప్రభావాన్ని భారత ఆర్థిక వ్యవస్థపై వెంటనే అంచనా వేయడం తొందరపాటు అవుతుందని, పరిస్థితులను సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని అన్నారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!