

రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ నైపుణ్యాలు పెంచుకుంటే చాలా రంగాల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. మనుషుల అభివృద్ధికి పోషకాహార లోపాన్ని తగ్గించడం కూడా చాలా అవసరమని సూచించారు. జూబ్లీహిల్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ భవిష్యత్తు ప్రణాళిక సమావేశంలో ఆయన ఈ విషయాలు చెప్పారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
వ్యాపారాలకు సౌలభ్యం ఉంటేనే కొత్త పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని రఘురామ్ రాజన్ చెప్పారు. స్టార్టప్స్కు ఎక్కువ ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు. విద్యలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగంపై కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో నైపుణ్య విశ్వవిద్యాలయాలు, శిక్షణ కేంద్రాల ద్వారా ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు. కృత్రిమ మేధస్సును సరైన విధంగా ఉపయోగిస్తే అందరికీ ప్రయోజనం ఉంటుందని రాజన్ అభిప్రాయపడ్డారు. తమిళనాడు తరహా పారిశ్రామిక విధానం తీసుకొస్తే మరిన్ని పెట్టుబడులు వస్తాయని సూచించారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, భూమి, విద్యుత్, రవాణా సౌకర్యాలు సమృద్ధిగా ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!