
జనరల్

బ్యాంకింగ్ ఉద్యోగులు మరోసారి సమ్మెకు సిద్ధమవుతున్నారు. వారానికి ఐదు రోజుల పనిదినాలతో పాటు ఇతర కీలక డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఈ నెల 11న దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టనున్నట్లు ఏడు బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) ప్రకటించింది. తమ డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.
ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సమ్మెను నివారించకపోతే దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. సమ్మెకు సంబంధించి పరిస్థితులు కొనసాగితే దాదాపు నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. దీంతో ఖాతాదారులు, వ్యాపార కార్యకలాపాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!