

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో కాపీరైట్ వివాదాలకు సంబంధించి అతిపెద్ద పరిణామంగా యాంత్రోపిక్ (Anthropic) సంస్థ 1.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.14,400 కోట్లు) సెటిల్మెంట్కు అంగీకరించింది. అనుమతి లేకుండా కాపీరైట్ పుస్తకాలను ఏఐ శిక్షణ కోసం వినియోగించిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ఒప్పందం కుదిరింది. బ్లూమ్స్బరీ ప్రచురించిన 14 వేలకుపైగా పుస్తకాలు, అందులో జేకే రౌలింగ్, సారా జే మాస్, సుసన్నా క్లార్క్ రచనలు కూడా ఈ పరిధిలో ఉన్నాయి.
ఈ సెటిల్మెంట్ ప్రకారం అర్హత కలిగిన ప్రతి పుస్తకానికి సగటున 3,000 డాలర్ల పరిహారం అందనుంది. న్యాయ ఖర్చులు మినహా మిగిలిన మొత్తాన్ని ప్రచురణ సంస్థలు, రచయితలు సమానంగా పంచుకోనున్నారు. ఈ తీర్పు ఏఐ రంగంలో కాపీరైట్ చట్టాలకు కీలక మైలురాయిగా నిలవడంతో పాటు, ఓపెన్ఏఐ, మెటా వంటి సంస్థలపై కొనసాగుతున్న కేసులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!